తెలంగాణ సీఎం కేసీఆర్ చార్మినార్ జోన్లో వికారాబాద్ జిల్లా ఉంటుందని స్పష్టం చేశారు. నేడు రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా.. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం వికారాబాద్ జిల్లా జోగులాంబ జోన్లో ఉన్న విషయం తెలిసిందే. చార్మినార్ జోన్లో కలుపుతున్నట్లు కేసీఆర్ ప్రకటించడంపై వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్ రెడ్డిలు హర్షం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట నిలబేట్టుకున్న సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.