జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ఈ రోజు పర్యటిస్తున్నారు. అక్కడి రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పవన్ పర్యటనపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. వాస్తవాలను వెతికితీయడానికే వారి పర్యటనలను ఉపయోగించుకోవాలని పవన్ కల్యాణ్ కు సూచించారు.
చంద్రబాబును నమ్మి పొలాలు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని విమర్శించారు. అప్పట్లో మంగళగిరి రూరల్ మండలం బేతపూడిలో అక్రమాలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ ఆరోపించారని గుర్తుచేశారు. గతంలో చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను పవన్ బయటపెట్టాలని సూచించారు. రైతుల భూములను చంద్రబాబు బలవంతంగా తీసుకోవాలని చూస్తే, తాను ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని నాడు పవన్ ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.