బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ పెళ్ళికి సంబంధించి పలు వార్తలు బిటౌన్ లో హాట్ టాపిక్ గా మారాయి. వరుణ్ ధావన్ కొన్నాళ్ళుగా నటాశా దలాల్తో ప్రేమాయణంలో ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం వరుణ్ ధావన్ వివాహం 2020లో జోధ్పూర్లోని ఉమైద్ భవన్ ప్యాలెస్లో జరగనుందని చెబుతున్నారు. గతంలో వీరి వివాహం 2019 డిసెంబర్లో గోవా వేదికగా జరగనుందని, ఆ తరువాత పెళ్లి తర్వాత ముంబైలో గ్రాండ్గా రిసెప్షన్ జరపాలని ప్లాన్ చేస్తున్నారని అన్నారు. వరుణ్, నటాశా ఇద్దరు చాలాసార్లు పబ్లిక్గా కనిపించారు. వాళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతోందని చాలా పుకార్లు వచ్చినప్పటికీ.. కరణ్ జోహార్ టాక్ షో కాఫీ విత్ కరణ్లో నటాశాతో తనకున్న రిలేషన్షిప్ గురించి వరుణ్ నోరు విప్పారు. నేను తనతో డేట్ చేస్తున్నా. మీమిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం.. అని వరుణ్ ఆ షోలో ప్రకటించారు. వరుణ్ ధావన్.. ఇటీవలే కళంక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు . ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కళంక్లో వరుణ్ సరసన అలియా భట్ నటించింది. ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్, రెమో డిసౌజ్తో త్రీడీ డ్యాన్స్ సినిమాలో వరుణ్ నటిస్తున్నారు. త్రీడీ డ్యాన్స్ సినిమాలో వరుణ్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది.
previous post
వరల్డ్ కప్ ఫైనల్స్ పై మహేష్ వ్యాఖ్యలు