ఇంటి వద్ద భార్యభర్తలిద్దరికీ గొడవ తలెత్తడంతో భార్య తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో తన భర్త పనిచేసే పత్రికా కార్యాలయం ఎదుట ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. హైదరాబాద్ లోని ఓ పత్రికా కార్యాలయంలో మార్కెటింగ్ విభాగంలో భర్త పని చేస్తున్నాడు. ఇంటి వద్ద దంపతులిద్దరి మధ్య జరిగిన గొడవతో ఆగ్రహించిన భార్య.. భర్త పని చేస్తున్న పత్రికా కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
కర్ణాటక ఎమ్మెల్యేల రాజీనామాల పై సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు