దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కించారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేశ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లక్ష్మి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటించారు. ఊర్వశి, రాజేంద్రప్రసాద్, రావు రమేశ్, నాగశౌర్య ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 5న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. సినిమా అంచనాలను అందుకుంటూ ఘన విజయంగా నిలిచింది. ఎమోషనల్తో పాటు పలు కామెడీ సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఈ సినిమాలో సమంత నటనకు సినీ అభిమానులే కాక సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలోనే కాక విదేశాలలోను ఈ చిత్రానికి మంచి వసూళ్ళు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల్లో ఈ సినిమా 17 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ వారాంతం వరకూ ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరును చూపించే అవకాశాలు వున్నాయి.
previous post
ఆ స్టార్ హీరోని పెళ్ళి చేసుకుని ఉండేదానిని… రకుల్ కామెంట్స్