ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తల్లి మరణించడంతో వారి ఇంట విషాదం నెలకొంది. ఈ రోజు తెల్లవారుజామున సందీప్ రెడ్డి తల్లి వంగ సుజాత కన్నుమూశారు. ఆమె స్వగృహం వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతికి పలువురు నివాళులు అర్పించారు. విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా రూపొందిన “అర్జున్ రెడ్డి” చిత్రం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి చివరిగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని హిందీలో “కబీర్ సింగ్” పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా ఈ చిత్రం మంచి విజయం సాధించింది. త్వరలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.
previous post