కొరటాల శివ దర్శకత్వంలో నటుడు చిరంజీవి హీరోగా స్టార్ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై రామ్చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మాతలుగా చిరంజీవి 152వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్తో వరుస బ్లాక్ బస్టర్స్ను సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైన్గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో మెసెజ్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. సైరా మీడియా మీట్లో రామ్ చరణ్తో కలిసి నటించనున్నట్లు కాస్త క్లూ ఇచ్చారు చిరంజీవి. అయితే లేటెస్ట్గా తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొరటాలతో సినిమాలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో నటించబోతున్నారట. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో 40 నిమిషాలు ఉండే పాత్రను చేస్తున్నారట రామ్ చరణ్. ఆయన సరసన నాయిక పాత్ర కూడా ఉంటుందనీ, ఆ పాత్ర కోసం అన్వేషణ సాగుతుందని చెప్పారు. చరణ్ జోడీగా సమంతను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ‘రంగస్థలం’ సినిమాతో చరణ్ – సమంత జంటకు మంచి క్రేజ్ పెరిగింది. అభిమానులంతా ఈ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అనేశారు. అందువల్లనే చరణ్ సరసన సమంతను కొరటాల ఖరారు చేసినట్టు చెబుతున్నారు. ఇక చిరంజీవి సరసన నాయికగా త్రిష కనిపించనున్న సంగతి తెలిసిందే. త్వరలో మొదలయ్యే రాజమండ్రి షెడ్యూల్లో ఆమె జాయిన్ కానుందని అంటున్నారు. ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.
మరో వివాదంలో చిక్కుకున్న వనిత