తెలుగులో అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 అంగరంగవైభవంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున ఈ షోను ప్రారంభించి ఏకంగా 19మంది కంటెస్టెంట్లను హౌస్ లోకి పంపించాడు. మునుపెన్నడూ లేనంతగా 5మచ్ సందడితో రెండో రోజు నుంచే అలకలు, ఏడుపులు, గొడవలు స్టార్ట్ అయ్యాయి.
తొలి వారంలో సరయూ, జశ్వంత్, యాంకర్ రవి, హమీదా, మానస్, ఆర్జే కాజల్ నామినేషన్స్లో ఉన్నారు ఈ ఆరుగురు కంట్స్టెంట్లలో ఒకరు ఈ వారం హౌస్ నుంచి బయటికి వెళ్లనున్నారు. ఇక మొదటి మూడు రోజులు పరిశీలిస్తే.. జెస్సీ. కంట్స్టెంట్ ఈ వారం ఎలిమినేట్ కావడం పక్కాగా కనిపిస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లోనే అత్యంత వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నాడు జెస్సీ.. 2018లో జశ్వంత్ సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు. ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టాడు. మొదట్లో కొంచెం సెన్సిటివ్, ఇన్నోసెంట్గా కనిపించిన జెస్సీ.. ఆ తర్వాత తనలోని షేడ్స్ అన్నింటిని ఒక్కొక్కటిగా బయటికి చూపిస్తున్నాడని నెటిజన్లు నెట్టింట కామెంట్ చేస్తున్నారు.
చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఎవరికి గౌరవం ఇవ్వకుండా అవమానించేలా ప్రవర్తిస్తుండటం వల్లే గొడవలు మొదలవుతున్నాయని అభిమానులు చెబుతున్నారు. ఇప్పటికే నామినేషన్ చేసినవాళ్లతో గొడవపడి కన్నీళ్లు పెట్టుకున్న జెస్సీ.. మంగళవారం ఆనీ మాస్టర్తో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆమెను సోఫాపై కూర్చోనీయకుండా జెస్సీ కాలు పెట్టడంతో.. ఆనీ మాస్టర్ ఫైర్ అయింది. జశ్వంత్ కూడా ధీటుగా రెచ్చిపోయాడు. ఇద్దరి గొడవ తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు.
ఇక అనీ మాస్టర్ విషయంలో.. జశ్వంత్దే తప్పు అని అందరి వాదన. గొడవ అనంతరం అనీ మాస్టర్ దగ్గరకు వెళ్లి జెస్సీ సారీ చెప్పినా మాటల యుద్ధం ఆగలేదు. ఈ క్రమంలోనే ప్రేక్షకుల దృష్టిలో జెస్సీ విలన్ కావడంతో ఈ వారం ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.