సినీ నటి, ఎంపీ సుమలత లోక్ సభలో తొలిసారిగా రైతుల సమస్యలపై తన గళం విప్పారు. ఎంపీ హోదాలో రైతులు ఎదోర్కొంటున్న సమస్యల పై ప్రసంగించారు. లోక్ సభ జీరో అవర్ లో సుమలత తన ప్రసంగంలో ప్రధానంగా రైతుల ఆత్మహత్యలు, కరవు, నీటి సంక్షోభం, చెరకు, వరి రైతుల ఇబ్బందులను ప్రస్తావించారు.
మాండ్యలో నీటి కొరత తీవ్రస్థాయికి చేరిందని, రైతులను అత్యవసర ప్రాతిపదికన ఆదుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చివర్లో జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేసి ప్రసంగాన్ని ముగించారు. సుమలత లోక్ సభ ఎన్నికల్లో మాండ్య నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
రాజధాని అమరావతిపై చర్చ జరుగుతోంది: మంత్రి బొత్స