తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మరోసారి మండిపడ్డారు. కేసీఆర్ సంగతి అటు అసెంబ్లీలోనూ, ఇటు బయట ఎండగడతానని చెప్పారు. కొత్త అసెంబ్లీ, సచివాలయం కట్టడం కాదని పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. అధికారం కోసమే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారని అన్నారు
తాను పీసీసీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాను రేసులో లేనని స్పష్టం చేశారు. సీఎల్పీ పదవి వదిలేసి పీసీసీ పదవి అడిగే నాయకుడిని తాను కాదన్నారు. అధిష్టానం తనకు అప్పగించిన పదవిని సక్రమంగా నెరవేరుస్తానని భట్టి పేర్కొన్నారు.