ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి తగినంత సమయం అయ్యాక పాలనపై స్పందిస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.. ఈ రోజు విజయవాడలో జనసేన పార్టీలో ముఖ్య కమిటీలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేనను ఏర్పాటు చేశామని పవన్ చెప్పారు. యువత లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.
కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం పాలన, పాలసీలను దృష్టిలో పెట్టుకుని2014 లో టీడీపీ ప్రభుత్వం తప్పు ఒప్పులను వెతకడానికి చాలా సమయం తీసుకున్నా. దాదాపు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకూ ప్రశ్నించకుండా ఉన్నా. అలాగే వైసీపీ ప్రభుత్వానికి కూడా తగినంత సమయం ఇస్తాం. రాష్ట్రప్రభుత్వం నిజంగా ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ప్రవేశపెడితే కచ్చితంగా హర్షిస్తామని పవన్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో విధ్వంస, దుర్మార్గ పాలన ప్రారంభమై మూడేళ్లు..