తెలుగు, తమిళ భాషల్లో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా ఇటీవలే బాలీవుడ్ లో కూడా ఓ చిత్రంలో కన్పించింది. కెరీర్ మొదట్లో వరుస హిట్లతో మంచి అవకాశాలు అందుకున్న రెజీనా ఇప్పుడు డీలా పడిపోయింది. ఈ గ్లామర్ ప్రపంచంలో మిగతా హీరోయిన్లకు గట్టి పోటీని ఇవ్వలేకపోయింది ఈ భామ. ఇక ఇటీవల పీవీపీ సంస్థ నిర్మించిన “ఎవరు” చిత్రంలో హీరోయిన్ గా నటించింది రెజీనా. ఈ చిత్రం ఆగస్ట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక నూతన దర్శకుడు అర్జున్ సాయి తెరకెక్కిస్తున్న “ఉత్సవం”లో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక తమిళంలో “కసడ తపర”, “పార్టీ”, అరవింద్ స్వామితో “కల్లాపార్ట్” అనే సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే రెజీనా తన మాజీ ప్రియుడితో ఎంగేజ్మెంట్ జరుపుకుందని, ఈ నెల 13న రెజీనా సీక్రెట్గా నిశ్చితార్ధం జరుపుకుందని, త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే రెజీనా స్పందించాల్సిందే.
previous post