మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “సైరా నరసింహారెడ్డి” చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. యువరాణిగా కీలక పాత్ర పోషించనున్న ఆమె తొలిసారి అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిందట. వీటిని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత.. డిజైనర్ అంజు మోదీతో కలిసి రూపొందించారని తమన్నా ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. సుస్మిత ఖైదీ నెంబర్ 150 చిత్రానికి కూడా కాస్ట్యూమ్ డిజైనర్గా పని చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో చిరంజీవి డ్రెస్సింగ్ స్టైల్ అభిమానులని ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి చిత్రం కోసం కూడా సుస్మిత మంచి కాస్ట్యూమ్స్ని డిజైన్ చేసినట్టు చెబుతున్నారు. సైరా చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, ఇందులో చిరంజీవి సరసన నయనతార కథానాయికగా నటిస్తుంది. విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్, సుదీప్ , జగపతి బాబు ప్రత్యేక పాత్రలలో కనిపించనున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారని చెబుతున్నారు.
previous post
next post
ప్రేమ పాజిటివ్ గా ఉండాలి… వికృత రూపంలో కాదు : హరీష్ రావు