రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన రజనీకాంత్, పార్టీ పెట్టి కూడా ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన కమలహాసన్ లపై దక్షిణాది నటుడు సత్యరాజ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడులో రాజకీయ శూన్యత ఉందంటూ రజనీ వ్యాఖ్యానించారు. రజినీ వ్యాఖ్యలపై స్పందించిన సత్యరాజ్ కౌంటర్ ఇచ్చారు. తమిళనాడులో ఎలాంటి రాజకీయ శూన్యత లేదని ఓటర్లు నిరూపించారని, స్థానికేతరులు ఇక్కడ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని నిర్మొహమాటంగా చెప్పారు. రజనీకాంత్ స్థానికతను దృష్టిలో పెట్టుకుని సత్యరాజ్ ఈ కామెంట్ చేసినట్టు అర్థమవుతోంది. తమిళనాడులో ఆరాధ్యదైవంగా వెలుగొందుతున్న రజనీకాంత్ జన్మతః మరాఠీ వ్యక్తి అన్న విషయం తెలిసిందే. మరోవైపు, కమలహాసన్ పైనా కొత్తగా పార్టీ పెట్టినవారు కూడా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారని, ఎన్నికల్లో విఫలం అయ్యారని కట్టప్ప తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
previous post
next post
జీవితాలతో చెలగాటాలాడొద్దు ప్రకాష్ రాజ్..