నేడు కేరళలోకి రుతుపవనాలు రానున్నాయి. ఈ నెల 1న రావలిసిన నైరుతి రుతుపవనాలు వారం రోజులు ఆలస్యంగా నేడు కేరళను తాకనున్నాయి. రుతుపవనాలు ఇంకా తాకకముందే కేరళలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, రుతుపవనాల రాక నేపథ్యంలో అధికారులు పలు జిల్లాల్లో రెడ్, ఆరంజ్, యెల్లో అలర్టులను జారీచేశారు.
ఆదివారం కేరళ, కర్ణాటక తీర ప్రాంతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడనుందని, దీని ప్రభావం వల్ల రుతుపవనాలు వాయవ్య దశలో వేగంగా కదిలే అవకాశం ఉందని పేర్కొన్నారు. గత సంవత్సరం విపత్తును దృష్టిలో పెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కార్యదర్శి శేఖర్ తెలిపారు.


నీరే జీవనానికి ఆధారం… కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతం: నాగార్జున