telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

1000 మంది రైతుల పోటీ పై స్పందించిన కవిత!

MP Kavitha comments BBP Govt.

నిజామాబాద్‌ సిట్టింగ్ ఎంపీ కల్వకుంట్ల కవితపై 1000 మంది రైతులు నామినేషన్లు దాఖలు చేయాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ విషయం పై కవిత స్పందించారు. సోమవారం నిజామాబాద్ లో మీడియాతో ఆమె మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరికైనా అర్హత ఉందని ఆమె అన్నారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలు ఈనాటివి కావని, దశాబ్ధాల పాటు పరిపాలించిన ఆంధ్రా పాలకుల వైఖరి వల్లే ఈ సమస్యలు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.

రైతుల సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం చూస్తున్న రైతు సంఘాలతో చర్చిస్తానని చెప్పారు. ఇండియాకన్నా చిన్న దేశాలు, పేద దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని అన్నారు. కొందరి వైఖరితోనే ఇండియా వెనుకబడివుందని అన్నారు. జాతీయ స్థాయిలో సైతం కేసీఆర్ వంటి నేతల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.

బీజేపీకి అధికారం ఇస్తే, ఒకసారి నోట్లు, మరోసారి టాక్స్ మార్చారని ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలు ఏ మాత్రం లబ్ది పొందలేదని ఆరోపించారు. పుల్వామా దాడిలో మరణించిన సైనికులకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షల చొప్పున ప్రకటించిన ఏకైక సీఎం కేసీఆరేనని కొనియాడారు. 

Related posts