ఈ నెల 28న గుంటూరులో జరిగే ఎన్టీఆర్ జయంతి వేడుకలకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొననున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారిగా చంద్రబాబు ఓ పార్టీ కార్యక్రమంలో హాజరుకానున్నారు. గుంటూరులోని టీడీపీ ఆఫీసు ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన నివాళులు అర్పిస్తారు. అనంతరం పార్టీ నేతలతో బాబు సమావేశం నిర్వహిస్తారు.
ప్రతి ఏడాది మహానాడు ఉత్సవాలను ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించే టీడీపీ ఈసారి వాయిదా వేసింది. ఎన్నికల ఫలితాల హడావుడి ఉంటుందన్న కారణంతో జూలైలో మహానాడు నిర్వహణకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ జయంతిని మాత్రం యధావిధిగా మే 28న నిర్వహించాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది.
చిదంబరం కేసులకు ఆధారాలు: నితిన్ గడ్కరీ