గ్యాంగ్స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న కోసం ఏపీ, తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. మాజీ మావోయిస్టు వెంకట్ రెడ్డి శేషన్నకు ఆశ్రయం కల్పించినట్టుగా పోలీసులు గుర్తించారు. నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్నకు మాజీ మావోయిస్టు వట్టి వెంకట్ రెడ్డి ఆశ్రయం ఇచ్చినట్టు తెలుస్తోంది.
వెంకట్ రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా సున్నిపెంట. అయితే, శేషన్నకు కర్నూలు జిల్లాలోని బొల్లవరంలోని తన బంధువుల ఇంట్లో ఆశ్రయం కల్పించినట్టు సమాచారం. తమ ఆచూకీ పోలీసులకు తెలిసిందన్న సమాచారంతో శేషన్న, వెంకట్ రెడ్డి పరారయ్యారు. వీరి కోసం రెడ్ను తెలుగు రాష్ట్రాల పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
ప్రతి అవ్వ ముఖంలో సంతోషం కనిపిస్తుంది: హరీష్ రావ్