“ఆర్ఎక్స్ 100” సినిమాతో హీరోగా కార్తికేయ యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం ‘హిప్పీ’ నిర్మితమైంది. తెలుగుతో పాటు తమిళంలోను రూపొందిన ఈ సినిమాకి కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, ‘టీఎన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు . ఈ చిత్రంలో దిగాంగన కథానాయికగానటిస్తుంది. ఈ చిత్రం నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. “ఎవతివే .. ఎవతివే .. ఎదను పట్టి వదలవే. ఎవతివే .. ఎవతివే .. కళ్లలోంచి కదలవే .. ” అంటూ ఈ పాట సాగుతోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం .. నివాస్ కె. ప్రసన్న సంగీతం .. కార్తీక్ ఆలాపన యూత్ ను ఆకట్టుకునేలా వున్నాయి. జేడీ చక్రవర్తి .. వెన్నెల కిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, త్వరలోనే విడుదల కానుంది. మీరుకూడా ఈ లిరికాల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.
previous post
తెలుగు సినిమా దమ్ము ఏంటో బాలీవుడ్ కు తెలిసింది : రానా