డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో ‘”జేమ్స్ బాండ్” 25వ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘నో టైమ్ టు డై’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 3, 2020న యూకేలో, ఏప్రిల్ 8, 2020న యూఎస్లో సినిమా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. మోట్రో గోల్డెన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కారీ జోజి ఫుకునాగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అపహరణకు గురైన ఓ శాస్త్రవేత్తను కాపాడేందుకు మళ్లీ బాండ్ను విధుల్లోకి తీసుకొస్తారని, దీని ఆధారంగానే ఈ చిత్ర కథ ఉండబోతోందని సమాచారం. బాండ్ 25 చిత్రానికి ఆ మధ్య పలు సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. “జేమ్స్ బాండ్ సినిమా : నో టైమ్ టు డై” ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో సన్నివేశాలు చూస్తుంటే ప్రేక్షకుల ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
previous post
next post
లిప్ లాక్ గురించి మాట్లాడితే… ఆ అమ్మాయితో పని కష్టం : యామీ గౌతమ్