నేడు ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు ఈ ఫలితాలను విడుదల చేశారు. డిప్లొమా అనంతరం ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ప్రవేశాల కోసం ఏపీ ఈసెట్ నిర్వహించారు.
ఈ పరీక్ష కు రాష్ట్రవ్యాప్తంగా 37,749 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో 37,066 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మే 19 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చని విజయరాజు తెలిపారు. అనంతపురం జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు.