తెలంగాణ రాష్ట్రంలో స్కిల్డెవలప్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు కోరుతున్నారు. స్వయం ఉపాధి పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులకు కంప్యూటర్ శిక్షణను అందించేందుకు పేస్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో టీసేవ స్కిల్ డెవల్పమెంట్ కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ఈ స్కిల్ డెవల్పమెంట్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన అభ్యర్థులు, మహిళా అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజులో 25 శాతం తగ్గింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిన అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద క్యాష్బ్యాక్ ఓచర్లు లభిస్తాయని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏప్రిల్ 30లోగా ఆన్లైన్లో దరఖాస్తుచేసుకోవాలని సూచించారు.