జగన్, కేసీఆర్పై పల్నాటి పౌరుషం చూపించాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన గుంటూరు జిల్లా గురజాల రోడ్ షోలో మాట్లాడుతూ కేసుల కోసం భయపడి జగన్ రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రేపటి ఎన్నికల్లో జగన్ వెనుక ఉండేది కేసీఆర్, మోదీ అని దుయ్యబట్టారు.
మోదీ ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండు…తప్పుడు పనులుచేస్తే దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుందని చంద్రబాబు హెచ్చరించారు. ఐదు వీవీ ప్యాట్లే లెక్కిస్తామని సుప్రీకోర్టు అంటోందని, ఈవీఎంలలో అక్రమాలపై పోరాడతామని స్పష్టం చేశారు. ఇప్పుడు మోదీ గెలిస్తే దేశంలో ఇక ఎన్నికలే ఉండవని చంద్రబాబు అన్నారు. భవిష్యత్కు సంబంధించిన ఎన్నికలివని, ఒక్కసారని వైసీపీకి ఓటేస్తే తీవ్రంగా మనం నష్టపోతామని చంద్రబాబు అన్నారు. తాను సీఎం అయితే పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పారు.
వైసీపీ రౌడీలు మరో అడుగు ముందుకేశారు: నారా లోకేశ్