ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార ప్రతిపక్ష ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఒకరిపై మరొకలు విమర్శలు చేస్తూ రోడ్ షోలు, భాహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాగునీరు విషయంలో వైసీపీ కార్యకర్తలు దారుణంగా ప్రవర్తించారు.
ఇవి వైసీపీ నీళ్లు.. టీడీపీ వాళ్లు పట్టుకోవద్దంటూ వైసీపీ కార్యకర్తలు ఓ విద్యార్థిని పై దాడికి పాల్పడ్డారు. ఆమె తలపై కొడవలితో నరికారు. అనంతరం ఈడ్చుకెళ్లారు. అడ్డుకోబోయిన తల్లిదండ్రులపైన కూడా కర్రలతో దాడి చేశారు. అంతేకాక ఇంటి గోడలు కూలగొట్టి వైసీపీ కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. తమ సభకు రాలేదని నీళ్ల వంకతో వైసీపీ దౌర్జన్యం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు.