మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన “లూసిఫెర్” చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా హిట్ టాక్ తో, బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. పొలిటికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, మంజు వారియర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రం. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి ప్రేక్షాదరణను పొందుతోంది.
దీపక్ సంగీతాన్ని సమకూర్చారు. మార్చి 28న విడుదలైన ఈ చిత్రం కేవలం నాలుగు రోజులలో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్ళని రాబట్టి సంచలనం సృష్టించింది. తాజాగా ఈ చిత్రం కేరళలో 6 రోజులకి 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేసింది. గతంలో బాహుబలి-2 కేరళలో 7 రోజుల్లో 30 కోట్లను రాబట్టింది. లూసిఫర్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజులకి గాను 78 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని తెలుస్తోంది. పొలిటికల్ డ్రామాగా నిర్మితమైన లూసిఫర్ వంద కోట్ల మార్కుని సులువుగా అందుకుంటుందని అంటున్నారు. వైవిధ్యభరితమైన కథాకథనాలు, పాత్రల్లోని కొత్తదనం ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం.