ప్రముఖ సినీ నటుడు అలీ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల ప్రచారం త్వరలో ముగియనున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అలీ నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాస్ భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పుడు ఆయనకు మద్దతుగానే అలీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఈ స్థానం నుంచి గత ఎన్నికల్లో మంత్రి గంటా శ్రీనివాస్ విజయం సాధించగా, ఈ సారి టీడీపీ అధిష్ఠానం భీమిలి టికెట్ సబ్బం హరికి కేటాయించింది.
బీజేపీ వాళ్లు నలుగురు గెలవగానే ఆగడం లేదు: కేటీఆర్