పందెం రాయుళ్లు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జోరు పెంచారు. బెట్టింగులతో సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఈ ఎన్నికలతో నేరుగా బరిలోకి దిగుతున్న పవన్పైనే బెట్టింగ్ వీరుల దృష్టి పడింది. భీమవరం నుంచి బరిలోకి దిగుతున్న పవన్ గెలుపోటములపై జోరుగా పందేలు కాస్తున్నారు.
భీమవరానికి చెందిన బంగారు వర్తకుడు పవన్ విజయం సాధిస్తారని ఐదు లక్షల రూపాయల పందెం కాసినట్టు తెలుస్తోంది. భీమవరం రెండో పట్టణానికి చెందిన చేపల చెరువుల యజమాని ఒకరు భీమవరంలో జనసేన విజయం పక్కా అంటూ రూ. 15 లక్షలు పందెం కాసేందుకు సిద్ధం అట. మరో ఆక్వా వ్యాపారి అయితే పవన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ పది లక్షల రూపాయలు పందెం కాసినట్టు తెలుస్తోంది. విషయం బయటకు పొక్కడంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్ రాయుళ్లపై దృష్టిసారించారు. ఒక పక్క ఎన్నికలు మరోపక్క ఐపీఎల్ సాగుతున్న నేపథ్యంలో పందెం రాయిళ్ల వేట కూడా బాగానే సాగుతుంది.