తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గ్యాస్ గృహ వినియోగదారులు ఇబ్బందులకు గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని తెలిపారు.
ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదని పేర్కొన్నారు. గ్యాస్ కొరతపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా గ్యాస్ నిల్వలు, అంతర్జాతీయ పరిస్థితులపై మంత్రి ఉత్తమ్ సమీక్షించారు.
ఈ సమావేశానికి సీఎస్, కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు, గ్యాస్, ఆయిల్ కంపెనీలు, లీగల్ మెట్రలాజీ అధికారులు హాజరయ్యారు.
ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలని మార్గనిర్దేశం చేశారు. గ్యాస్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు.

