ఆంధ్రప్రదేశ్లో గత వైకాపా ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం క్రైమ్ రేట్ 6 శాతం తగ్గిందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఈరోజు అసెంబ్లీలో వెల్లడించారు.
రాష్ట్రంలో ఓవరాల్గా ఐపీసీ/బీఎన్ఎస్ (IPC/BNS) నేరాలు 6.17% తగ్గాయి. కేసుల సంఖ్య: 2024లో 1.10 లక్షలుగా ఉన్న కేసులు, 2025 నాటికి 1.03 లక్షలకు తగ్గాయి.
అల్లర్లు (Riots): 53.88% భారీగా తగ్గుదల. ఎస్సీ, ఎస్టీలపై నేరాలు: 24.32% తగ్గాయి. మహిళలపై నేరాలు: 3.82% తగ్గుదల నమోదైంది. పోక్సో (POCSO) కేసులు: 11.4% తగ్గాయి.
నేరాల నియంత్రణ కోసం ఏపీ పోలీసులు టెక్నాలజీని వాడుతూ, గంజాయి సాగు నిర్మూలన వంటి చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు

