telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రైల్వేబడ్జెట్‌లో తెలంగాణకు రూ. 5,454 కోట్ల కేటాయింపులు: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

రైల్వేబడ్జెట్‌లో తెలంగాణకు రూ. 5,454 కోట్ల కేటాయింపులు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంతో పోలిస్తే.. 6 రెట్లు ఎక్కువ కేటాయింపులు.

తెలంగాణలో ఇప్పటికే రూ.47,984 కోట్ల విలువైన.. ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి, హైస్పీడ్ రైలు లేదా బుల్లెట్ ట్రైన్ మేజర్ హబ్‌గా హైదరాబాద్ మారబోతోంది.

తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది, రవాణా సహా అనేక కీలక అంశాల్లో లబ్ధి చేకూరుతుంది. దేశంలో చేపట్టబోయే ఏడు హైస్పీడ్ రైల్వే కారిడార్లో 5 దక్షిణాది రాష్ట్రాల్లోనే వస్తున్నాయి.  5 ప్రాజెక్టులు ఏపీ, తెలంగాణకు గేమ్ చేంజ్ ప్రాజెక్టులు అన్నారు.

రైల్వే బడ్జెట్లో ఏపీకి రూ. 10,134 కోట్ల కేటాయింపులు – ఏపీలో ఇప్పటికే రూ. 92,649 కోట్ల విలువైన.. ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఏపీలో 100% విద్యుదీకరణ పూర్తయింది.

73 రైల్వేస్టేషన్లను పునర్నిర్మాణం చేశాం. కోల్‌కతా-చెన్నై కారిడార్ 4 లేన్లుగా అభివృద్ధి చేస్తున్నాం. వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తాం.

విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు వేగవంతం. గతంలో కొత్త జోన్ ఏర్పాటుకు నాలుగేళ్ల సమయం పట్టేంది. విశాఖ రైల్వేజోన్ వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చేలా పనిచేస్తున్నాం.

త్వరలో హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుతో టచ్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాం.

ఇప్పటికే చాలా ప్రగతిని సాధించాం, త్వరలోనే హెడ్ క్వార్టర్స్ నిర్మాణ పనులు ప్రారంభిస్తాం అని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Related posts