మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత ఆయన రేపు తెలంగాణ భవన్కు రానున్నారు.
రాష్ట్ర సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతున్నారు.
రేపు మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది.
ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ సాగునీటి హక్కుల పరిరక్షణ కోసం చేపట్టాల్సిన ప్రజా ఉద్యమంపై పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవలం 45 టీఎంసీలకే అంగీకరించి తెలంగాణకు అన్యాయం చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
నదుల అనుసంధానం పేరుతో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని, రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఈ విషయంపై మౌనంగా ఉన్నారని కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారు.
ఈ అంశంలో కాంగ్రెస్, బీజేపీలను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
మరోవైపు, పార్టీ ప్రక్షాళన, సంస్థాగత బలోపేతంపైనా కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
చాలాకాలం తర్వాత తమ అధినేత తెలంగాణ భవన్కు వస్తుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

