వివేకా హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. షర్మిలకు ఊరటనిస్తూ… కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛను ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని నిరూపణ అయిందని పేర్కొన్నారు.
“ఈ విజయం తొలి అడుగు మాత్రమే. రాబోయే రోజుల్లో వివేకా కుటుంబానికి న్యాయం కోసం పోరాటం ఉద్ధృతం చేస్తాం. చిట్టచివరిగా విజయం, నిజం, న్యాయం వైపే ఉంటాయని చూపిస్తాం” అని షర్మిల ఉద్ఘాటించారు.


మన రాజ్యాంగం సక్రమంగా అమలు కాలేదు : ఈటల