telugu navyamedia
ఆంధ్ర వార్తలు

నేపాల్ క్యాసినోకు వెళ్లినవారిలో సగం మంది వైసీపీ నేతలే..-వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న కామెంట్స్‌

*టీడీపీ నేత వ‌ర్ల రామ‌య్య సంచ‌ల‌న కామెంట్స్‌
*ఎమ్మెల్యే కొడాలి నాని,వ‌ల్ల‌భ‌నేని వంశీ కి చికోటి స‌న్నిహితుడు
*ఈడీ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు..త్వ‌ర‌లోనే అన్నీ బ‌య‌ట‌కు వ‌స్తాయి..

వైసీపీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు జీవం పోస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మాజీమంత్రి కొడాలి నాని , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలోనే.. చికోటి ప్రవీణ్‌ గుడివాడలో క్యాసీనో నిర్వహించారని ఆరోపించారు.

నేపాల్ క్యాసినోకు వెళ్లినవారిలో సగం మంది వైసీపీ నేతలేనని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వానికి నేపాల్ కెసీనోకు వెళ్లిన.. ప్యాసింజర్స్ లిస్టు బయటపెట్టే ధైర్యం ఉందా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

వైసీపీ నేతల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు జరపాలని డిమాండ్ చేశారు.క్యాసినో ద్వారా కొడాలి నాని, వల్లభనేని వంశీ.. ఏ వ్యాపారాలు చేస్తున్నారో త్వరలో బయటపెడతానని వర్ల రామయ్య ప్రకటించారు.ఈడీ ఎవ‌రినీ వ‌దిలిపెట్ట‌దు..త్వ‌ర‌లోనే అన్న బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని అన్నారు.

Related posts