తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేసింది. వాయిదా పడిన పరీక్షల్లో ఎంసెట్, ఈసెట్, పీజీఈసెట్.. ఉండగా వాటి షెడ్యూల్ను ఖరారు చేసింది.
ఈ నెల 30, 31 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఇక ఈసెట్ ను ఆగస్టు 1న, పీజీఈసెట్ను ఆగస్టు 2 నుంచి 5 వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
వాస్తవానికి ఈ పరీక్ష ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సి ఉంది. ఎడతెరపి లేకుండా కొనసాగిన వర్షాల కారణంగా పరీక్షలను వాయిదా వేసింది ఉన్నత విద్యామండలి. ఎంసెట్ ఇంజనీరింగ్ కు సంబంధించిన పరీక్షలను మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహిస్తోంది.
తాజాగా వాయిదా పడిన అగ్రికల్చర్ ఎంసెట్ కు సంబంధించిన తేదీలను తాజాగా విడుదల చేసింది ఉన్నత విద్యామండలి. పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 2 నుంచి 5వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.
వాయిదా పడిన ప్రవేశ పరీక్షల షెడ్యూలు….
1. ఈనెల 30, 31న టీఎస్ ఎంసెట్ (అగ్రికల్చర్&మెడికల్)
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
2. టీఎస్ ఈసెట్ ఆగస్టు 1న
ఉదయం 9 నుంచి 12 మధ్యాహ్నం వరకు
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
3. టీఎస్ పీజీఈసెట్- ఆగస్టు 2 నుంచి 5 వరకు
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు
మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు