ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సైమా అవార్డుల్లో దుమ్ములేపింది. అల వైకుంఠపురములో చిత్రం ఏకంగా పది అవార్డులు ఎగరేసుకుపోయింది.
ఆదివారం రాత్రి సైమా 2020 అవార్డుల ఫంక్షన్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. సైమా 2020 అవార్డులో ‘అల వైకుంఠపురం’ చిత్రం పలు విభాగాల్లో అవార్డులు కొల్లగొట్టి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఈ సైమా 2020 అవార్డుల వేడుకల్లో బన్నీ టీం సందడి చేసింది. ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ని జీవిత సాఫల్య పురస్కారం (2019) వరించింది. దీనిని చిరంజీవి, రాధిక చేతుల మీదుగా అందించారు. ఇక లెజెండరీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యంకి సైమా ఘన నివాళి అర్పించింది.
ఈ చిత్రం అవార్డులు దక్కించుకున్న విభాగాలు ఇవే..
*ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్
*ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
* ఉత్తమ నటిగా పూజాహెగ్డే,
*ఉత్తమ సహాయనటుడిగా మురళీశర్మ
*ఉత్తమ సహాయనటిగా టబు
* ఉత్తమ సంగీత దర్శకుడిగా తమన్
* ఉత్తమ గేయ రచయితగా రామజోగయ్య శాస్త్రి (బుట్టబొమ్మ సాంగ్)
* ఉత్తమ నేపథ్య గాయకుడిగా అర్మాన్ మాలిక్ (బుట్టబొమ్మ సాంగ్)
* ఉత్తమ ప్రతినాయకుడిగా సముద్రఖని
* ఉత్తమ చిత్ర నిర్మాణ సంస్థగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంస్థలు ‘అల వైకుంఠపురం’ చిత్రానికి గాను అవార్డులు దక్కించుకున్నాయి.