ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో దారుణం చోటుచేసుకుంది. మహిళల రక్షణ కోసం నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.
గుర్తు తెలియని దుండగులు బైక్పై వెళ్తున్న దంపతులపై దాడి చేశారు. అనంతరం అనంతరం భార్యను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కత్తులతో బెదిరించి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద చోటుచేసుకుంది. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు గుంటూరు నగరంలో ఓ వివాహానికి హాజరై బైక్పై తిరిగి ఇంటికి వెళుతున్నారు.
ఈ ఘటనపై మేడికొండూరు పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదు అనంతరం బాధితురాలికి వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దారిదోపిడి, అత్యాచార సంఘటన జరిగిన స్థలంలో డాగ్ స్క్వాడ్ తో నిందితుల ఆధారాల కోసం వెతుకుతున్నారు. అనంతరం 10మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.