ఝార్ఖండ్ ధన్బాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాయబంధ్ కల్వర్టు దగ్గర కారు అదుపుతప్పి వంతెనపై నుంచి.. 100 మీ. లోతులో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ ఘటన ధన్బాద్ సమీపంలోని గోవింద్పూర్లోని జీటీ రోడ్డు (ఎన్హెచ్-2)లో మంగళవారం ఉదయం జరిగింది. వేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.
మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. వీరిలో ఇద్దరిని గుర్తించారు..కరి పేరు వసీం అక్రమ్ కాగా మరొకరి పేరు షకీల్ అక్తర్. ఇద్దరినీ ఆధార్ కార్డు ఆధారంగా గుర్తించారు. మృతులు రామ్గఢ్లోని గటోటాండ్కు చెందిన వారు. అందరూ స్విఫ్ట్ డిజైర్ కారు (JH-02 AM 0996)లో ప్రయాణిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది స్థానికులు అక్కడ ఉండడంతో.. వెంటనే గోవింద్పూర్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. మృతుడి జేబులోంచి ఆధార్కార్డు లభ్యం కావడంతో వారిని గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ధన్బాద్కు తరలించారు. రామ్గఢ్లో మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.