పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ లతో బిజీగా ఉన్నారు. మలయాళ డ్రామా అయిన“అయ్యప్పనుమ్ కోషియుమ్” అధికారిక రీమేక్ షూటింగ్ కొన్ని వారాల నుంచి జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో సర వేగంగా జరుగుతోంది.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నాడు. ఆగష్టు 15న పవర్ స్టార్మ్ రాబోతోందని అప్డేట్ ఇచ్చారు.ఇక కొన్ని రోజుల క్రితం నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని, ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది అని ప్రకటించారు. ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.
అంతేకాదు..పవన్కు “గబ్బర్ సింగ్” వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు.
ఈ సందర్భంగా పవణ్ అభిమానులకు హరీష్ శంకర్ కొత్త పోస్టర్ ను సర్పైజ్ చేయనున్నారట. పొలిటికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని నవీన్ ఎర్నేని మరియు వై రవి శంకర్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు.
అంతేకాకుండా పవన్ చేస్తున్న “పిఎస్పికే28” నుంచి కూడా సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం. ఇకపోతే పవర్ స్టార్ సినిమా అంటే ప్రేక్షకుల్లో మాములు క్రేజ్ఉండదు. ఆయన సినిమా కోసం అభిమానులనంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డబుల్ ధమకాతో ఇక మెగా ఫ్యాన్స్ కి పండగే పండగే..!