telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రజినీ టీంకు ఊరట… ఐదేళ్లనాటి కేసును తేల్చేసిన కోర్టు

Rajinikanth

సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా మాస్ చిత్రాల దర్శకుడు కేయస్‌ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “లింగా”. కమర్షియల్‌గా పెద్దగా వర్క్‌ అవుట్ కాకపోయినా కథా కథనాల పరంగా ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ సమయంలో పెద్ద దుమారమే చెలరేగింది. ఈ సినిమా కథ కాపీ అంటూ రవి రత్నం అనే డైరెక్టర్‌ మధురై కోర్టులో కేసు వేశారు. లింగా కథను తన సినిమా ముల్లై వానమ్‌ 999 నుంచి కాపీ చేశారంటూ ఆరోపించాడు రవి రత్నం. ఈ కేసు కారణంగా లింగా సినిమా రిలీజ్ విషయంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు పది కోట్ల రూపాయల పూచీకత్తుతో సినిమా రిలీజ్‌కు అనుమతించింది కోర్టు. ఐదేళ్లుగా కోర్టులో నలుగుతున్న ఈ కేసుపై తీర్పు వెలువరించింది న్యాయస్థానం. లింగా కథ కాపీ కాదంటూ తేల్చి చెప్పింది. దీంతో చిత్ర నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌కు ఊరట లభించినట్టైంది. తమిళనాట స్టార్ హీరోల సినిమాలపై ఈ కాపీ ఆరోపణలు కామన్‌ అయిపోయాయి. ముఖ్యంగా రజనీ, విజయ్‌ల సినిమాల విషయంలో ఈ ఆరోపణలు ఎక్కువగా విన్పిస్తుండడం గమనార్హం.

Related posts