నెల్లూరు జిల్లా తిన్నెలపొడికి చెందిన రిటైడ్ హెడ్మాస్టర్ కోటయ్య మృతి చెందారు. ఆనందయ్య వద్ద కంట్లో చుక్కలు వేసుకుని బతికానని కోటయ్య ఓ వీడియో ద్వారా చెప్పాడు. దీంతో అనందయ్య మందు వెలుగులోకి వచ్చింది. అయితే కంట్లో చుక్కల మందు వేసుకున్న వారం రోజులకు ఆరోగ్యం క్షిణించి కోట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు కోటయ్య. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కోటయ్య ను 22న నెల్లూరు జిజిహెచ్ కి తరలించారు. గత వారం రోజుల నుండి చికిత్స పొందుతూ నెల్లూరు జిజిహెచ్ లో మరణించాడు కోటయ్య. కోటయ్య మృతితో అనందయ్య మందుపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా…ఆనందయ్య మందు పై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు సమచారం. ఆనందయ్య మందు పై ఆయుష్ నివేదికను ఇవాళ ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12 గంటలకు సమీక్ష అని అధికార వర్గాల సమాచారం.ఆనందయ్య మందులో ఉపయోగించే మూలికలు హానికరం కావని నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం.