సీఎం వైఎస్ జగన్ రెడ్డి పేరు ఇక నుంచి జాంబీ రెడ్డి అని అన్నారు నారా లోకేష్.. సీఎం కుర్చీలో ఉన్నవారికి సంక్షేమం, అభివృద్ధి చేస్తే ఆనందం వస్తుంది.. కానీ, జాంబీ రెడ్డి.. టిడిపి నేతలు, కార్యకర్తల అరెస్టులతో ఆనందిస్తున్నారని మండిపడ్డారు.. మాపార్టీ వారిపై కేసులు, అరెస్టులు టీవీల్లో చూసి తాడేపల్లి ఇంట్లో జాంబీ రెడ్డి తొడ కొట్టుకుంటారనంటూ సెటైర్లు వేసిన లోకేష్.. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి యాక్టర్ గా మారారని.. అనపర్తిలో స్థానిక ఎమ్మెల్యే అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టారనే రామకృష్ణారెడ్డిని అక్రమ అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం, రామవరం గ్రామంలో కేసులు, అరెస్టులకు గురైన టీడీపీ నాయకుడు..మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించిన నారా లోకేష్… ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.. చట్టానికి వ్యతిరేకంగా మాపై కేసులు పెడుతున్న అందరి పేర్లు సిద్ధంగా ఉన్నాయి, వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
previous post


ఏపీలో నిర్మాణ రంగం క్షీణించిపోయింది: ఉండవల్లి