ఘాట్ కేసర్ విద్యార్ధి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నలుగురు ఆటో డ్రైవర్లను అన్యాయంగా బీ ఫార్మసీ విద్యార్థి ఇరికించిన విషయం తెలిసిందే. తనను నలుగురు ఆటో డ్రైవర్లు గ్యాంగ్ రేప్ చేసారని ఆరోపణలు చేసింది ఆ విద్యార్ధి. పోలీసులు చాకచక్యంతో ఈ కేసును చేధించి.. ఆ ఆటో డ్రైవర్లను నిందితులుగా విడిచిపెట్టారు. అయితే తాజాగా ఈ కిడ్నాప్ డ్రామా కేసు విషాదంతం అయింది. డ్రామా ఆడిన బీ ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. షుగర్ టాబ్లెట్స్ మింగి సుసైడ్ చేసుకుంది. ఈ ఘటన ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి… వివరాలు సేకరిస్తున్నారు.
previous post
ఆ కథనం ప్రసారం చేసినందుకే.. ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసింది