telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా

చైనాలో పురుడుపోసుకున్న కరోన వైరస్ క్రమంగా అన్నీ దేశాలకు విస్తరిస్తోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. తాజాగా కొప్పుల ఈశ్వర్ కు కరోనా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ అధికార ప్రతినిధి ప్రకటించారు. ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో నిన్న పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో సిఎం ఎన్. రంగస్వామిని చెన్నైలోని ఓ కార్పొరేట్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్. రంగస్వామి రెండు రోజుల క్రితమే పుదుచ్చేరి సిఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Related posts