బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది కంగనా రనౌత్. ఈ అమ్మడు ఎప్పుడు కాంట్రవర్సీల చుట్టే తిరుగుతుంది. అయితే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీ షెడ్యూల్ గడుపుతోంది. అయితే… నిత్యం వివాదాలతో వార్తాల్లోకెక్కే కంగనాపైనే కాంట్రావర్సీ కామెంట్స్ చేసి రచ్చ చేశాడు ఓ కాంగ్రెస్ నేత. వివరాల్లోకి వెళితే… కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత, మధ్యప్రదేశ్ మాజీ మంత్రి సుఖ్దేవ్ పన్సే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఐటెం గాళ్ అంటూ కామెంట్ చేశాడు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని పోలీసులు కంగనా కనుసన్నల్లో పనిచేయడం మానుకోవాలన్నాడు. మధ్యప్రదేశ్లో కంగనా మూవీ ధకడ్ షూటింగ్ను అడ్డుకున్న పార్టీ కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి చేశాక కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేత సుఖ్దేవ్ పన్సే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది నటి కంగనా. తాను దీపికా, ఆలియాభట్ లాంటి హీరోయిన్ కాదన్నది. ఐటెమ్ సాంగ్స్ చేయని ఒకే ఒక్క హీరోయిని బడా హీరోల సినిమాలను కూడా తిరస్కరించనని చెప్పుకొచ్చింది. తాను రాజ్పుత్ మహిళని తనపై చౌకబారు కామెంట్లు చేస్తే ఎముకలు విరగ్గొడతానంటూ కౌంటర్ ఇచ్చింది కంగనా. కాంగ్రెస్ నేతపై కంగనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరో వివాదానికి దారి తీశాయి.
previous post