మహానగరం హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీ మీర్ చౌక్ పరిధిలోని ఎంజీబీఎస్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతూ.. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఇద్దరు యువకులు బైక్ పై నుంచి కిందపడ్డారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న లారీ వారిపై నుంచి దూసుకుపోవడంతో సంఘటన స్థలంలోనే ఆ ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలిసిన పోలీసులు… ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన ఇద్దరు యువకుల్లో ఒకరు ఫసీ ఖాన్(19) కాగా.. మరొకరు మోసిన్ (23)గా పోలీసులు గుర్తించారు. అంతేకాదు..మృతులు ఇద్దరు చదర్ ఘాట్ ముసా నగర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.
previous post