telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఎస్సారెస్పీ కాలువలోకి కారు.. ముగ్గురు మృతి

జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జాతర వెళదామనుకున్న ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. జగిత్యాల జిల్లాలోని మేడిపల్లి-కట్లకుంట మధ్యగల ఎస్సారెస్పీ కేనాల్ లోకి కారు దూసుకెళ్లింది. జగిత్యాల నుండి జోగినపల్లికి జాతర నిమిత్తం వెళ్తుండగా ఇవాళ ఉదయం ఈ విషాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కాలువలో గల్లంతు కాగా…ఒకరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు…ఎట్టకేలకు కాలువలో గల్లంతైన కారును బయటకు తీసారు. అయితే.. గల్లంతైన కారులో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. బయటపడ్డ మృతదేహాలు జగిత్యాలకు చెందిన న్యాయవాది అమరేందర్ మరియు ఆయన కుటుంబ సభ్యులుగా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే.. ప్రమాదానికి గురైన వారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమీప బంధువులని సమాచారం. ఈ ఘటన ఎలా జరిగిందన్న దాని పై పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts