telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణాలో రాజన్న రాజ్యం తీసుకొస్తా : షర్మిల

ys sharmila as ycp party working president

నల్గొండ జిల్లాతో పాటు ప్రతీ జిల్లా నేతలను కలుస్తా తెలంగాణాలో రాజన్న రాజ్యం ఎందుకు లేదన్నది నా ప్రధాన ఆలోచన. నేడు నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నా తెలంగాణాలో రాజన్న రాజ్యం కచ్చితంగా తీసుకొస్తా అని వైఎస్ షర్మిల అన్నారు. వైఎస్ లేని లోటు తెలంగాణాలో కనపడుతుంది. క్షేత్ర స్థాయి పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నా… తెలంగాణా క్షేత్ర స్థాయి పరిస్థితులు నల్గొండ జిల్లా నేతలకు తెలుసు. అభిమానులకు చెప్పకుండా పార్టీ పెట్టను. నేటి నుంచి అందరితో మాట్లాడతా. త్వరలోనే అన్ని విషయాలు ప్రకటిస్తా అని అన్నారు. అయితే 10 రోజుల క్రితం షర్మిల భర్త అనిల్ తన ఫేస్ బుక్ లో కొత్త పార్టీ పై సంకేతాలు ఇచ్చారు. ఉదయం 10గంటలకు లోటస్ పాండ్ లోని తన నివాసం లో నల్గొండ జిల్లా కార్యకర్తల తో సమావేశం ఏర్పాటు చేసారు. ఉమ్మడి నల్గొండ నుంచి 3 వేల మంది వైఎస్సార్ అభిమానులు వస్తున్నారు. 100 మంది ముఖ్యులతో ప్రత్యేక సమావేశం. ఇవ్వాళ్టి నుంచి తెలంగాణ లోని ఉమ్మడి జిల్లాల వారీగా షర్మిల ఆత్మీయ సమ్మేళనాలు జరగనున్నాయి. పార్టీ అజెండా,కార్యాచరణ,లాంటి అంశాల పై కార్యకర్తల తో చర్చల అనంతరం పార్టీ నీ అధికారికంగా ప్రకటించనున్నారు షర్మిల. తెలంగాణ లో మరో పార్టీ కి అవకాశం ఉంటుందని వైఎస్సార్ అభిమానులు అంటున్నారు.

Related posts