మదనపల్లిలో సొంత కూతుళ్ల హత్యల కేసులో తల్లిదండ్రులు పురుషోత్తమ్, పద్మజను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరోనా టైంలో ఇంట్లో ఉంటూ… పూర్తిస్థాయిలో ఆధ్యాత్మికంగా లీనమైన కుటుంబం సభ్యులు… ఒకరకమైన మూఢత్వంలోకి వెళ్లిపోయారు. ఉన్మాదభక్తితో కన్నప్రేమను మర్చిపోయారా తల్లిదండ్రులు. కడుపున పుట్టిన పిల్లల్ని… కర్కషంగా చంపేశారు. మదనపల్లి జంట హత్యల కేసులో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటూనే ఉంది. తాజాగా ఈ కేసులో నిందితులను విశాఖకు తరలించారు. ట్రీట్మెంట్ కోసం విశాఖలోని మానిసిక చికిత్సా కేంద్రానికి నిందితులు పురుషోత్తం, పద్మజలను తరలించారు పోలీసులు. కూతుళ్లను చంపిన దంపతుల్ని కొన్నాళ్లుగా మదనపల్లి సబ్ జైల్లో ఉంచారు అధికారులు. అయితే… సబ్ జైల్లో ఉన్న తోటి ఖైదీలకు తమ వింత చేష్టలతో చుక్కలు చూపించారు నిందితులు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఖైదీలు. ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారోనని భయపడ్డారు ఖైదీలు. నిందితుల వింత చేష్టలు శృతి మించడంతో ఇద్దర్నీ విశాఖకు తరలించారు అధికారులు. విశాఖలో ఇద్దరు నిందితులకు ట్రీట్మెంట్ ఇప్పటించనున్నారు అధికారులు.
previous post