ఇప్పుడు టాలీవుడ్లో హీరో మాస్ మహరాజా రవితేజ పారితోషికం గురించి తరచుగా చర్చ జరుగుతుంది. అతడు రెమ్యూనిరేషన్ పెంచేశాడని, తగ్గించుకోమన్నా వినడం లేదని తరచుగా వార్తలు సర్కులేట్ అవుతూనే ఉంటాయి. అయితే మళ్లీ ఇటువంటి వార్తలే వినిపిస్తున్నాయి. రవితేజ క్రాక్ సినిమాతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ముందువరకు సినిమాకి రూ.10-12 కోట్లు తీసుకునే వాడట. తాజాగా రవితేజ తరువాత సినిమాకి రూ.15కోట్లు డిమాండ్ చేస్తున్నాడని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రవితేజ విషయంలో ఇదేమీ కొత్త కాదు. తన సినిమా హిట్ అయితే పారితోషికం పెరిగుతుంది. అతడు పెంచిన పారితోషికానికి ఓకే అనుకున్న వారే తనతో సినిమాలు చేస్తారని అంటుుంటారు. ఇదిలా ఉంటే రవితేజ తాజాగా రమేష్ వర్మ దర్శకత్వంలో మరో మాస్ మసాలా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి ఖిలాడీ పేరును ఖరారు చేశారు. ఈ సినిమాని నిర్మాత సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా జరిగే బిజినెస్ మొత్తం రవితేజ పేరుపై ఆధారపడి ఉంటుంది. దాంతో ఇలాంటి సినిమాలకి అధిక పారితోషికం ఆశిస్తే తప్పేంటని రవితేజ సన్నిహితులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
జగన్ కు తమ సహకారం ఉంటుంది: నాగబాబు