ఈ మధ్యే జరిగిన అమెరికా అధ్యక్షా ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఒదిన విషయం తెలిసిందే. అయితే డొనాల్డ్ ట్రంప్కు తాజాగా షాక్ తగిలినట్టు అయ్యింది.. త్వరలోనే అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న ట్రంప్పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఇరాక్ కోర్టు… ఇరానియన్ జనరల్ ఖాసిం సోలిమని, ఇరాకీ మిలీషియా లీడర్ అబు మహ్ది అల్ ముహండిస్ హత్య కేసులో ఈ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. కాగా, ఈ ఇద్దరు నేతలు గత ఏడాది జనవరిలో జరిగిన డ్రోన్ దాడిలో మృతిచెందారు.. దీనిపై విచారణ జరిపిన బాగ్దాద్ ఇన్వెస్టిగేటివ్ కోర్టు జడ్జి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అరెస్ట్ వారంట్ జారీ చేశారు.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థపై పోరాడేందుకు ఏర్పాటు చేసిన పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్కు డిప్యూటీ లీడర్గా అల్ ముహండిస్ వ్యవహరించగా.. సోలిమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్లో కుద్స్ ఫోర్స్ చీఫ్గా పనిచేశాడు.. ఈ ఇద్దరు కీలక నేతలు.. బాగ్దాద్ ఎయిర్పోర్ట్పై జరిగిన డ్రోన్ దాడిలో చనిపోయారు.. వీరిని ప్లాన్ ప్రకారమే హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి.. ఈ కేసులోనే ట్రంప్కు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. అది అమలు చేసే అవకాశం లేదనే చెప్పొచ్చు.. మరోవైపు.. ఈ నేరం రుజువైతే దోషికి మరణ శిక్ష విధించవచ్చు అంటున్నారు ఇరాక్ న్యాయ నిపుణులు. చూడాలి మరి ఈ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది అనేది.
previous post